ఆమెతో అక్రమ బంధం వద్దన్నాడని… చంపేశాడు…

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ వేళ తీవ్రమైన ఘోరాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ఓ మహిళతో అక్రమ సంబంధం వద్దని చెప్పినుందుకు గాను సదరు వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన వెలుగు చూసింది. పెద్ద బండరాయి తీసుకుని ఛాతిపై బలంగా కొట్టడంతో ప్రియురాలి బంధువు ప్రాణాలు కోల్పోయాడు.

అయితే వివాహేతర సంబంధాల మోజులో దారుణాలకు తెగబడుతున్న ఘటన రోజూ సమాజంలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. సుఖాల కోసం సమాజం దారుణాలకు పాల్పడుతుంది. పగలు ప్రతీకారాలు తీర్చుకుంటుంది. ఎంతటి వారైనా సరే అడ్డొస్తే బలిచేసేస్తుంది. వివాహిత మహిళతో అక్రమ సబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె సమీప బంధువు హెచ్చరించడంతో హత్య చేసేశాడు. ఆమెతో ఇకపై ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని చెప్పినందుకు గాను అతడు బలి అయ్యాడు.

కాగా హిందూపురం మండలం మీనకుంటపల్లికి చెందిన నాగరాజు అదే గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఇద్దరూ కలుసుకుంటూ సుఖాలను అనుభవిస్తూ ఉండేవారు. వారిద్దరి రాసలీలల వ్యవహారం ఆమె సమీప బంధువైన కోనాపురం అంజికి తెలిసి నాగరాజుని హెచ్చరించాడు. ఆమెతో సంబంధాలు పూర్తిగా వదిలేయమని హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. దాంతో ఆగ్రహానికి గురైన నాగరాజు దారుణానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నాగరాజు అతని కుటుంబ సభ్యులతో కలసి అంజిపై దాడి చేశాడు.

నాగరాజు, అతని తండ్రి, అన్న, బాబాయ్ కలిసి అంజిని నిర్బంధించి చచ్చేంతవరకు కొట్టారు. ఏకంగా నాగరాజు పెద్ద బండరాయి తీసుకుని ఛాతిపై బలంగా కొట్టడంతో అంజి స్పృహ‌ తప్పి పడిపోయాడు. అది గమనించిన స్థానికులు అంజిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అంజికి ఒక భార్య, ఒక కుమారుడు ఉన్నారు.