మాస్ మహారాజ రవితేజ, ప్రియా భవాని శంకర్ జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన క్రేజీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఇరుముడి’ (Irumudi) పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న ఈ సినిమాను మేకర్స్ ఈ నెలలోనే గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం ఇప్పటికే ట్రైలర్ ట్రీట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్ను ఈరోజు సాయంత్రం విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. దీంతో రవితేజ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా కథ, రవితేజ పాత్ర, యాక్షన్తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్పై ట్రైలర్ ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న బజ్ను ట్రైలర్ మరింత పెంచుతుందా? సినిమాపై అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందా? అనే ఆసక్తి నెలకొంది. దీనికి సమాధానం తెలియాలంటే ఈ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.





