హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తాం

హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తాం

అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు టీడీపీ ఫై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు హయం లో అమరావతి కోసం కేంద్రం నిధులెన్నో ఇచ్చిన, అప్పు చేసిన చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం 5 వేల కోట్ల రూపాయలే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజధాని ని విశాఖపట్టణానికి తరలిస్తున్నారనే నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ లో ప్రతిపాదించడం, కేవలం 10 వేల కోట్ల తో హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తాం అంటూ వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని జిల్లాల్ని అభివృద్ధి చేసినపుడు మాత్రమే జరుగుతుంది అని అన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఇలానే వున్నాయి. అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత చర్చలు జరపననున్నారు. అయితే ఈ విషయం లో చంద్రబాబు ఇన్ని రోజులుగా ప్రజల మధ్య వున్నా, ఇలాంటి వ్యాఖ్యలు రాకపోవడం తో టీడీపీ లో ఆందోళన మొదలైంది. మరి ఈ విషయంలో యూ టర్న్ తీసుకుంటారో, లేదంటే అమరావతి పక్షాన నిలబడతారో చూడాలి.