స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో మరో ముందడుగు పడింది. ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణం స్పీడందుకుంటోంది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ టెండర్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది CRDA. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు… ఆ పరిధిలో ఉన్న గ్రామాలను సైతం అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.