AP Politics: జగన్ ప్రభుత్వానికి మావోయిస్టులు హెచ్చరిక

AP Politics: Maoists warn Jagan government
AP Politics: Maoists warn Jagan government

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మావోయిస్టులు హెచ్చరిస్తూ, 2పేజీల లేఖను విడుదల చేసారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా డివిజన్ మావోయిస్ట్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదల అయింది. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు మరణాలకు బాధ్యత వహిస్తూ.. రంపచోడవరం ITDA PO సూరజ్ గనోరేను, పాడే ITDA PO అభిషేక్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఒక్క నెలలో వివిధ ఆశ్రమ పాఠశాల 10, 12 ఏళ్ల వయస్సు ఉన్న నలుగురు చిన్నారులు మరణించారని.. ఆరు నెలల్లో ఈ మరణాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయని తెలిపారు. గిరిజన విద్యాశాఖ డీడీ కొండల్ రావు హాస్టళ్ల నుంచి పిల్లలు చెప్పకుండా వెళ్లిపోతున్నారని, తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులు కావడంతో నాటు వైద్యం అందించడం వల్లనే పిల్లలు మరణిస్తున్నారని సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వీరికి చీమకుట్టినట్టుగా కూడా లేదంటే ఆదివాసీ పిల్లల ప్రాణాల పట్ల వీరికెంత నిర్లక్ష్యం ఉందో అర్థం అవుతుందని తెలిపారు.