శ్రేష్ఠ చెబుతున్నది ఈ దర్శకురాలి గురించేనా?

Arjun Reddy Lyric Writer Shrestha sensational comments on women director
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పాటలు మరియు మాటల రచయితలు అంటే ఎక్కువగా మగాళ్లే టాలీవుడ్‌లో గుర్తుకు వస్తున్నారు. కాని ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న శ్రేష్ఠ ఇటీవల వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్‌లోని ఒక దర్శకురాలి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ దర్శకురాలు తానో మహిళను అనే విషయాన్ని మర్చి పోయి నీచంగా ప్రవర్తిస్తుందని, ఆమె తోటి ఆడవారిని లైంగిక వేదింపులకు గురి చేస్తోందంటూ శ్రేష్ఠ ఆరోపణలు చేసింది.

సదరు దర్శకురాలు ఒక పార్టీ కోసం తనను బలవంతంగా గోవాకు తీసుకు వెళ్లిందని, అక్కడ తనకు ఒక వ్యక్తిని పరిచయం చేసి, అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవంటే పడి చస్తున్నాడు అంటూ పరిచయం చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ సదరు దర్శకురాలు నీ గురించి మరో రకంగా చెప్పింది అంటూ పేర్కొన్నాడట. దాంతో షాక్‌ తిన్న శ్రేష్ఠకు ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలి అన్నంతగా కోపం వచ్చి కాల్‌ చేసి తిట్టేసిందట. ఇంతకు ఆ దర్శకురాలు ఎవరు అనే విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

ప్రస్తుతం తెలుగులో నోటెడ్‌ దర్శకురాల్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరిపై పెద్దగా అనుమానం లేదు, కాని ఒక దర్శకురాలి గురించి చర్చించుకుంటున్నారు. ఆమె మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ప్రస్తుతం మరో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థం అయ్యింది అనుకుంటా.. ఆమె గురించి గతంలో కూడా మీడియాలో బ్యాడ్‌గా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమె గురించే శ్రేష్ఠ వ్యాఖ్యలు చేసి ఉంటుందనే అనుమానం వ్యక్తం అవుతుంది.