ట్రాఫిక్ చలాన్ అడిగినందుకు వ్యక్తి మీద దాడి

Attack on person for asking traffic challan

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు కోరడంతో ఆ జరిమానా చెల్లించాక రశీదు కోసం పట్టుబట్టడంతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను దాడి చేసి అరెస్టు చేసినందుకు థానే ట్రాఫిక్ పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు.

మహారాష్ట్ర లోని థానే పట్టణంలో జరిగిన ఈ ఘటనపై హోంమంత్రి (పట్టణ) రాష్ట్ర మంత్రి డాక్టర్ రంజిత్ పాటిల్ విచారణకు ఆదేశించారు. అందుతున్న సమాచారం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు గాను ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

ఆ జరిమానా కతతిన్ అతను రశీదు కోరినప్పుడు, పోలీసులు అతని మీద దాడి చేశారు. అలాగే ఆ తర్వత అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఈ విషయం మీద థానే పోలీసుల నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోవదంతో అతను మంత్రికి కంప్లైంట్ చేశారు.

ఆ తర్వాత అతని మీద ట్రాఫిక్ పోలీసులు  డి చేశారు. అసలు ఏమైనదంటే ఆగస్టు 2 న రాత్రి 7 గంటల సమయంలో శశికాంత్ తివారీ (37) ఆఫీస్ నుండి ఇంటికి వెళుతుండగా తానే-బేలాపూర్ రహదారి వద్ద దిఘా గ్రామంలో పెట్రోల్ కొట్టించడానికి రాంగ్ రూట్ లో వెళ్ళాడు.

దీంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపమని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్‌ చూపమని కోరితే సదరు వ్యక్తి చూపించాడు ఆ తర్వాత దాన్ని తనిఖీ చేసిన తరువాత 1,700 రూపాయలు (హెల్మెట్ లేకుండా స్వారీ చేయడానికి 1,200 రూపాయలు మరియు తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి 500) దానికి అదనంగా 2,200 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని శశికాంత్ ని కోరారు.

Attack on person for asking traffic challan receipt

ఈ క్రమంలో ఆయన వారికి రూ .2,500 ఇచ్చాడు, అవే తనవద్ద ఉన్నాయని చెప్పి దానికి వారి నుండి రశీదు డిమాండ్ చేశారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ యంత్రం పనిచేయడం లేదని చెప్పారు. అయితే తను ఇంటర్నెట్ లో చెల్లిస్తానని చెబితే వారు నిరాకరించారట. అది గొడవకు దారి తీసి అతని మీద దాడి చేసినట్టు చెబుతున్నారు.