అర్థరాత్రి విశాఖలో హత్య…. ఆటో డ్రైవర్ ను అతిదారుణంగా…

అసలే కరోనా కాలం. ఏ ఒక్కరూ కూడా భయటకు రావాలంటేనే భయపడి చస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది దారుణాలకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. లాక్ డౌన్ వేళ కూడా కొన్ని నేరాలు యధేచ్చగా జరుతున్నాయి. విశాఖలో తాజాగా అర్థరాత్రి జరిగిన హత్య కలకలం రేపుతోంది. జిల్లాలోని దేవరపల్లి మండలం తెనుగుపూడిలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు.

అయితే దాసరి కృష్ణ అనే 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి కృష్ణ ఇంటికి కొంతమంది వచ్చారు. తలుపు కొట్టడంతో.. అప్పటికే నిద్రలోకి జారుకున్న కృష్ణ ఆ మత్తులోనే తలుపుతీశాడు. ఆ వెంటనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. అతి కిరాతకంగా నరికి చంపారు.

కాగా వెంటనే సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. అయితే చోడవరం సీఐ ఈశ్వరరావు, దేవరాపల్లి ఎస్ఐ పీ.నరసింహమూర్తి ఘటనా స్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి జాగిలాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ హత్యకు ఏమైనా కుటుంబ తగదాలతో సంబంధం ఉందా? లేకా ఇతర శతృవులు ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యుల్ని, స్నేహితులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.