టీం ఇండియాకు బ్యాడ్ న్యూస్..కీలక ఆటగాడు దూరం..!

Asia Cup
Asia Cup

నేటి నుండి ఆసియా కప్ శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా మొదలు కానుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఇక సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఇండియా తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది. కాగా ఇటీవల గాయం నుండి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన కె ఎల్ రాహుల్ ఆసియా కప్ లో రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడని బీసీసీఐ సమాచారం అందించారు.

గాయం నుండి పూర్తిగినా కోలుకున్నప్పటికీ , శ్రీలంకకు వారం రోజుల తర్వాతనే బయలుదేరనున్నాడట ఎందుకంటే 100 శాతం ఫిట్నెస్ సాధించలేని తెలిసింది. అందుకే ఆసియా కప్ లో మొదటి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు.ఇక వరల్డ్ కప్ కు టీం ను మూడవ తేదీన ప్రకటించనున్న నేపథ్యంలో రాహుల్ కు జట్టులో చోటిస్తారా లేదా అన్నది సందేహమే ?