డెంగ్యూ తో మృతి చెందిన పెళ్లి కూతురు

డెంగ్యూ తో మృతి చెందిన పెళ్లి కూతురు

డెంగ్యూ మరొక జీవితాన్ని కబళించింది. మూడుముళ్ల బంధంతో నూరేళ్లు సంసార జీవితాన్ని గడిపేందుకు సిదమైన పెళ్లికూతురిని డెంగ్యూ జ్వరం కాటేసింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని టీవీయన్‌ ఆర్‌పురం గ్రామంలో జరిగింది. గ్రామానికి  చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె చంద్రకళకు గత నెల 30న పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆమెకు డెంగ్యూ సోకింది.

వెంటనే ఆమెను తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు బంధుమిత్రులు, గ్రామస్థులు విషయం తెలియక బుధవారం పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఎలాగైనా ఆసుపత్రి నుంచి వధువును తీసుకొచ్చి తాళి కట్టించాలని పెద్దలు ప్రయత్నించారు. పరిస్థితి బాగా లేనందున వైద్యులు నిరాకరించడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే అంతలోనే చంద్రకళ మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లోను విషాదం నెలకొంది.