ప్రియుడితో చెక్కెసిన భార్య:క్వారంటైన్ లో భర్త……..

wife killed Husband with Lover Help in Kavali District

కరోనా వైరస్ ఎవరూ ప్రశాంతంగం ఉండనివ్వడం లేదు. కరోనా కల్లోలం అంతా ఇంతా అని చెప్పడానికి కూడా సాధ్యం కాని విధంగా జనాల్లో బీభత్సాన్ని సృష్టిస్తోంది. అలాగే ఈ కరోనా వైరస్ తో అనేక అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

అదేమంటే.. భర్త హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సయయంలో అతడి భార్య ప్రియుడితో వెళ్లిపోవడం కలకలం సృష్టిస్తోంది. కామాతురాణాం నభయం నలజ్జ అంటే ఇదేనేమో. అసలేం జరిగిందంటే.. దేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఢిల్లీలో నివాసముంటున్నాడు. ఏడాది క్రితం భార్య, పిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చాడు. అయితే అతడు మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నాడు. భర్త అడ్డులేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. మరి లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో ఆమె భర్త ఈ నెల 19 శ్రామిక్ రైల్లో ఢిల్లీ నుంచి ఛత్తర్‌పూర్ చేరుకున్నాడు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం అతడు తన ఇంట్లోనే పై అంతస్తులో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు.

ఇదే సమయంలో భార్య, పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. భర్త ఇంటికి వచ్చేయడంతో ఆమెకు ప్రియుడితో ఏకాంతంగా గడిపే సమయం దొరక లేకుండా పోయింది. దీంతో ఏకంగా ప్రియుడితో ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిర్ణయం తీసేసుకుంది. నెల 24వ తేదీ రాత్రి సమయంలో భర్త ఉంటున్న గదికి గడియ పెట్టి ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం తల్లి కనిపించకపోవడంతో పిల్లలు తండ్రికి చెప్పారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఆమె అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో తన భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.