పెళ్లైన రెండో రోజే వీఆర్వో ఆత్మహత్య!

cheepurupalli VRO committed suicide

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని బాబా మెట్ట పాంత్రంలో జరిగింది. బాబా మెట్ట ప్రాంతానికి చెందిన మోహన్‌ జిల్లాలోని చీపురుపల్లిలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏమయిందో ఏమో గానీ ఈరోజు సాయంత‍్రం జరగాల్సి ఉన్న రిసెప్షన్‌ పనుల్లో అందరూ తలమునకలయి ఉండగా మోహన్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమైన అయిన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

vizianagaram district vro vijay marriage