ఆస్పత్రిలో చిదంబరం

ఆస్పత్రిలో చిదంబరం

హోం శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా యూపీఏ హయంలో పని చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం జరిగినది. చిదంబరంపై వచ్చిన మనీ లాండరింగ్, అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు.

ఈడీ పర్యవేక్షణలో ఐఎన్‌ఎక్స్‌ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం తీహార్‌ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి కడుపునొప్పి రావడంతో ఆర్‌ఎమ్మెల్‌ ఆస్పత్రికి తరలించగా తర్వతా ఎయిమ్స్‌కు పంపించి, అక్కడి వైద్యులతో చికిత్స అందించారు. ఆయనకు ఉన్న సమస్య వైద్యులు వెల్లడించలేదు.  చికిత్స తర్వాత తిరిగి తీహార్‌ జైలుకు తీసుకెళ్లారు.