న్యూజెర్సీలో చిత్తూరు మహిళ మృతి

న్యూజెర్సీలో చిత్తూరు మహిళ మృతి

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత మరణించింది. అయితే ఆమె బలవన్మరణం చేసుకున్నట్లుగా తల్లిదండ్రులకు సమాచారం రాగా, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లికి చెందిన సుధాకర్ నాయుడుతో బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు 2016లో వివాహం జరిగింది.అప్పటికే అమెరికాలోని న్యూజెర్సీలో సుధాకర్ సాఫ్ట్‌‌‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు.

అయితే 2017లో ప్రేమలత భర్త సుధాకర్‌తో పాటు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల బాబు గీతాంష్ ఉన్నాడు.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే ప్రేమలతది ఆత్మహత్య కాదని.. అల్లుడు సుధాకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తండ్రి త్యాగరాజు నాయుడు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలత మృతదేహాన్ని పంపించడానికి భర్త నిరాకరిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.