ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన

ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన
Israel - Hamas war

ఇజ్రాయెల్ – హమాస్ ఉగ్రవాదులు మధ్య జరుగుతున్న భయంకర యుద్ధం నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్ లోని వివిధ పట్టణాల్లో దాదాపు 18 వేల మందికిపైగా భారతీయులు నివసిస్తునట్లు సమాచారం. ప్రస్తుతానికి వారంతా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. శనివారంతో పోల్చుకుంటే .ప్రస్తుత పరిస్థితులు కొంత సద్దుమణిగినట్టు భారతీయులు కొందరు తెలిపారు. హిబ్రూ వర్సిటీలో చదివే స్కాలర్, భారతీయ విద్యార్థులందరూ క్షేమమని తెలిపారు.  జెరుసలేంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆదేశించింది. గాజాలో నివాసం ఉంటున్న ఓ భారతీయుడు తాను, తన కుటుంబం సురక్షితమని తెలిపారు.