తెలంగాణ పోయినా ఆనందోత్సాహాల్లో కాంగ్రెస్…ఎందుకంటే !

congress party lagging then trs party

తెలంగాణలో ఘోర పరాభావం ఎదురైనప్పటికీ, సోనియా గాంధీ నివాసమైన 10 జనపథ్ లో సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో నాలుగోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కాషాయ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకుపోతోంది. 10 జనపథ్ ప్రాంతానికి చేరుకుంటున్న వేలాది మంది కాంగ్రెస్ నేతలు బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ పోయినా ఆనందోత్సాహాల్లో కాంగ్రెస్...ఎందుకంటే ! - Telugu Bulletమొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగగా, కీలకమైన రాజస్థాన్, చత్తీస్ గఢ్ లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టే. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గానూ కాంగ్రెస్ 116 స్థానాల్లోనూ, బీజేపీ 101 చోట్ల, బీఎస్పీ 5, ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికల జరగ్గా కాంగ్రెస్ 99 చోట్ల, బీజేపీ 76 చోట్ల, ఇతరులు 19 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇక చత్తీస్‌గఢ్‌లోని 90 స్థానాలకు గానూ 57 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఎంపీ, చత్తీస్‌గఢ్‌లో 2003 తర్వాత అధికారం కాల్పోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయం దిశగా సాగడంతో తిరిగి పగ్గాలు చేపట్టనుంది. 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలో కాంగ్రెస్ వరుస పరాజయాలతో కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయింది. అయితే, తాజా ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓ ఆక్సిజన్‌లా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.