రోజురోజుకి పెరుగుతున్న కోరోనా మరణాలు

రోజురోజుకి పెరుగుతున్న కోరోనా మరణాలు

ప్రపంచ దేశాలన్నింటిని కూడా గత కొంత కాలంగా తీవ్రమైన భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అతి భయంకరమైన మహమ్మారీ కరోనా వైరస్ మిగతా అన్ని దేశాల్లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కాగా ఈ మేరకు భారతదేశంలో కొరోనా బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలో కరోనా వైరస్ వలన మృతి చెందిన వారి సంఖ్య 8 కి చేరుకుందని, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) తెలిపింది. అయితే మహారాష్ట్ర లో భయంకరమైన కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వ్యక్తి విదేశానికి చెందిన మహిళగా వైద్యాధికారులు గుర్తించారు. కాగా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఒక మహిళా ఆదివారం నాడు కరొన వైరస్ కారణంగా మరణించింది.

ఈ మహిళా మరణంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 8 కి చేరగా, మహారాష్ట్ర లో ఈమెది మూడవ మరణం గా గుర్తించారు వైద్యాధికారులు. ఇకపోతే మహారాష్ట్ర లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నటువంటి వారి సంఖ్య 89 కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య వరుసగా కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణ 27, ఉత్తరప్రదేశ్‌ 27, కర్ణాటక 27, గుజరాత్‌లో 18 మంది ఉన్నారు.