భారత్‌లో కరోనా విళయతాండవం

భారత్‌లో కరోనా విళయతాండవం

భారత్‌లో కరోనా విళయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ప్రతి రెండు సెకన్లకు ఒక కరోనా కేసు నమోదవుతుంది. అయితే గడిచిన 24 గంటల్లో 53,601 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 22,68,675 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,39,929 యాక్టివ్ కేసులు ఉండగా, 15,83,489 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏకంగా 871 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 45,257 చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 6,98,290 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 69.8గా ఉన్నట్టు తెలుస్తుంది.