కరోనా రోగి హత్య

కరోనా రోగి హత్య

నగలు, సెల్‌ఫోన్‌ కోసం జీహెచ్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కరోనా రోగిని హత్య చేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. వెస్ట్‌ తాంబరానికి చెందిన ప్రొఫెసర్‌ మౌళి భార్య సునీత గత నెల కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండడంతో మే 23వ తేదీ చెన్నై రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఇంటికి వెళ్లిన ఆమె భర్త సైతం అనారోగ్యం బారిన పడ్డారు.

వారం రోజుల అనంతరం వచ్చి చూడగా, సునీత కనిపించడం లేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల అనంతరం ఆస్పత్రిలోని ఎనిమిదో అంతస్తులోని విద్యుత్‌ పరికరాల గది నుంచి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. పరిశీలించగా కుళ్లిన స్థితిలో సునీత మృతదేహం బయట పడింది. పోస్టుమార్టం చేశారు. మూడో అంతస్తులో ఉన్న సునీత ఎనిమిదో అంతస్తుకు ఎలా వెళ్లారో..? అనే అనుమానం తలెత్తింది.