తెలంగాణలో కరోనా కల్లోలం

తెలంగాణలో కరోనా కల్లోలం

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు 1,473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు కూడా 8 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 774 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 42,106 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 12,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 471కి చేరింది. ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 9,817 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 1,473 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,63,242 టెస్ట్‌లు చేశారు. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 2.3 శాతంగా ఉంటే తెలంగాణలో మాత్రం 0.85 శాతంగా ఉందని తెలిపింది.