‘గుంటూరు కారం’ ఇంటర్వెల్ పై క్రేజీ రూమర్ ?

‘గుంటూరు కారం’ ఇంటర్వెల్ పై క్రేజీ రూమర్ ?
Latest News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ‘గుంటూరు కారం’ సినిమా పై ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఒక భారీ సెట్ వేస్తున్నారని.. ఈ సెట్ లో వచ్చే వారం నుంచి షూట్ చేస్తారని టాక్ వస్తోంది . సెకండ్ హాఫ్ డ్రైవ్ మొత్తం ఈ సీక్వెన్స్ చుట్టే తిరుగుతుందని.. అందుకే, ఈ సీక్వెన్స్ ను త్రివిక్రమ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గుంటూరు కారం సినిమా లో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందంట .

‘గుంటూరు కారం’ ఇంటర్వెల్ పై క్రేజీ రూమర్ ?
Mahesh Babu” Guntur Karam “

కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ మూవీ నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ మూవీ కథని ప్లాన్ చేశాడట. పైగా ఈ మూవీ ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది . హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ మూవీ ను నిర్మిస్తోంది. ఈ మూవీ మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. జ‌న‌వ‌రి 13, 2024న ఈ సినిమా రిలీజ్ కానుంది.