Crime: మహిళ ఆత్మహత్య.. పక్కింట్లో మరో మహిళ హత్య.. కారణమేంటి..

Crime: Tragedy in Telangana.. A couple got married and drank pesticides
Crime: Tragedy in Telangana.. A couple got married and drank pesticides

ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే, పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కమలాపూర్కు చెందిన పులి రేణుక మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గీత కార్మికుడైన ఆమె భర్త గంగన్న పని నుంచి ఇంటికి వచ్చేసరికి రేణుక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిసింది.

వారింటి పక్కనే ఉండే పులి పద్మ కొద్దిసేపటికే హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసినట్లు కనిపిస్తోంది. కాగా పద్మహత్యకు గంగన్ననే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా గెట్టు తగాదాలు నడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ అరీఫ్ అలీఖాన్ పరిశీలించారు. ఇంకా బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు.