చోళీ కె పిచ్ క్యా హై పాట తెలుసు కదా, ఆ సినిమా మళ్ళీ విడుదలవుతోంది..ఎప్పుడంటే…

Madhuri Dixit
Madhuri Dixit

సంజయ్ దత్ జాకీ ష్రాఫ్ ,మాధురి దీక్షిత్ నటించిన ‘ఖల్ నాయక్’ సినిమా 30 సంవత్సరాల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సుభాష్ ఘాయ్ దర్శకుడు, నిర్మాత కూడా. మొన్న ఆగస్టు కి 6 వ తేదికి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు నిర్మాత ఒక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే ఈ సినిమా ని మల్లీ విడుదల చేయాలని అనుకున్నారు.

1993 లో ఒక యాక్షన్ డ్రామాగా విడుదలై ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది ఇందులో మాధురి దీక్షిత్, సంజయ్ దత్ మధ్య వచ్చే సన్నివేశాలు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అప్పట్లో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇలాగె ఇందులో కూడా చోళీ కి పిచ్ కె పీచే క్యా హై’ అన్నది అప్పట్లో ఒక సంచలనం. ఆ పాట కొన్ని సంవత్సరాల పాటు అందరి నోటిలో నానింది .అలాగే ఎక్కడ చూసినా పాటనే వేసేవారు, అంత ప్రాచుర్యం పొందింది.ఈ సినిమా దర్శకుడు, నిర్మాత సుభాష్ ఘాయ్ ఒక ప్రకటనలో ఈ సినిమాని మళ్ళీ సెప్టెంబర్ 5 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.