యాక్షన్ అయిపొయింది, ఇప్పుడు ఫోకస్ దేనిమీదో తెలుసా…

Ram Charan
Ram Charan

రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ చేంజెర్’ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఇప్పుడు గ్రీన్ పార్కు దగ్గరున్న గ్రీన్ ల్యాండ్స్ లో షూటింగ్ అవుతున్నట్టుగా తెలిసింది.దర్శకుడు శంకర్ ఇప్పుడు సినిమా మీదే ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే అతను ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలిసింది.

ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పని వుంది, అయితే ఇప్పుడు ఈ ‘గేమ్ చేంజెర్’ కూడా పూర్తి చెయ్యాలన్న దృష్టితో శంకర్ దీనిమీదే ఇప్పుడు ఫోకస్ పెట్టాడు అని తెలిసింది.అలాగే ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు అన్నీ పూర్తయ్యాయని, ఒక్కటి మాత్రమే మిగిలి ఉందని కూడా తాజా సమాచారం ప్రకారం తెలిసింది.

ఆ పోరాట సన్నివేశం వచ్చే నెలలో పూర్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే ఇప్పుడు శంకర్ రెగ్యులర్ సన్నివేశాల మీద దృష్టి పెట్టాడు అని కూడా తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్, అక్టోబర్ కల్లా అయిపోయేటట్టు ఉందని కూడా తెలుస్తోంది.

ఇందులో కియారా అద్వానీ కథానాయిక కాగా, అంజలి కూడా ఒక ప్రముఖ పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత. అప్పుడు అతని పక్కన అంజలి కనిపిస్తుంది అని అంటున్నారు. అలాగే సముద్రఖని ,జయరాం, నాసిర్ , శ్రీకాంత్ ఇంకా  చాలామంది క్యారెక్టర్ నటులు ఇందులో నటిస్తున్నారు.