మోడీతో పెట్టుకోవద్దని బాబుకు ముందే చెప్పా…వినలేదంటున్న బీజేపీ నేత

dont argue with modi

రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారో సులభంగా అర్థం అయిపోతుందని అన్నారు బీజేపీ నేత అంబికా కృష్ణ. ఈ మధ్యనే తెలుగుదేశం వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఈయన ఇప్పుడు ఓ రాజకీయ పార్టీగా టీడీపీ నిలదొక్కుకోవడం చాలా కష్టమని అంటున్నారు. ఒక చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తాను చంద్రబాబుకు చెప్పానని, పెద్దవాళ్లతో కూడా చెప్పించానని మనకు మోదీతో గొడవవద్దు. మనకు కావాల్సింది మళ్లీ అధికారంలోకి రావడమనిని చెప్పానని కానీ చంద్రబాబు వినిపించుకోలేదని ఆయన తెలిపారు. తాను ఊహించినట్టుగానే చివరికి 303 లోక్ సభ సీట్లతో మోదీ ప్రభుత్వం ఏర్పడిందని అంబికా కృష్ణ అన్నారు. 20 ఏళ్ల పాటు టీడీపీ కోసం పనిచేసిన తాను బీజేపీలోకి వెళ్లిపోతానని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారేముందు విషయాన్ని బాలకృష్ణకు చెప్పానని అన్నారు. అయితే ఈ విషయమై చంద్రబాబుతో మాత్రం చర్చించలేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాననీ, భారీగా డబ్బులు ఖర్చు పెట్టానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీలో ఎంత బాగా పనిచేసినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అయన పేర్కొన్నారు.