ఇథియోపియో ప్రధానికి శాంతి పురస్కారం

ఇథియోపియో ప్రధానికి శాంతి పురస్కారం

శాంతి స్థాపనకోసం కృషి చేసినందుకు ఇథియోపియో ప్రధాని అబీ అహ్మద్ అలీకి నోబెల్ శాంతి బహుమతి అందనుంది.ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతిబహుమతిని కమిటి ప్రకటించింది. సరిహద్దు దేశమైన ఎరిట్రియాతో ఉద్రిక్తతలు ఉన్న సందర్బంలో తగ్గించేందుకు చేసిన కృషికి ఇథియోపియో ప్రధానికి శాంతి పురస్కారం దక్కింది.ఎన్నోఏళ్లుగా ఇథియోపియో ఎరిట్రియా రెండు దేశాల మద్య వివాదాలు ఉన్నాయి.

ఇథియోపియా నాలుగో ప్రధానిగా 2018లో అబీ అహ్మద్‌ అలీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుని ఎరిట్రియా అధ్యక్షుడితో చర్చలు జరిపారు.ఈ వివాదాలని తగ్గించే దిశలో చొరవ చూపిన ప్రధాని అబీ అహ్మద్‌ అలీకి ఈ సారి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది.