Election Updates: రాజమహేంద్రవరంలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్

Election Updates: Suspension of 23 volunteers in Rajamahendravaram
Election Updates: Suspension of 23 volunteers in Rajamahendravaram

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారని ఇటీవల వారిపై తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు..

ఈ మేరకు వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుండా వైకాపా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.