Election Updates: బీఆర్ఎస్ లో చేరనున్న సీనియర్ లీడర్ రాగిడి లక్ష్మారెడ్డి..

Election Updates: Senior leader Ragidi Lakshmareddy will join BRS
Election Updates: Senior leader Ragidi Lakshmareddy will join BRS

BRS లో చేరనున్నారు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,సీనియర్ లీడర్ రాగిడి లక్ష్మారెడ్డి. మరి కాసేపట్లో కాంగ్రెస్ ను వీడనున్నారు రాగిడి లాక్ష్మ రెడ్డి. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,సీనియర్ లీడర్ లక్ష్మా రెడ్డి భేటీ కానున్నారు . మేడ్చల్ ప్రజా ఆశీర్వాదా సభలో అధినేత కేసీఆర్ సమక్షంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,సీనియర్ లీడర్ లక్ష్మ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ కానున్నారు .

కాగా, కాంగ్రెస్ పార్టీ టికెట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ స్పష్టమైన ఆధారాలతో మేము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాం, వివిధ రూపాల్లో నిరసన తెలియజేశాము. ఇందుకుగాను మమ్మల్ని పార్టీ నుంచి ఎలాంటి సంజాయిషీ లేకుండా సస్పెండ్ చేశారు.

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు టీపీసీసీ మాజీ కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ గద్వాల నియోజకవర్గం, ఖలీమ్ బాబా బహుదూర్ నియోజకవర్గం మరియు రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిదగ్గర కు వెళ్లి పూజలు చేసిన అనంతరం చార్మినార్ దగ్గర రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు.