పాత కక్షలకు అభంశుభం తెలియని బాలిక సజీవ దహనం

పాత కక్షలకు అభంశుభం తెలియని బాలిక సజీవ దహనం

పాత కక్షలకు అభంశుభం తెలియని బాలిక సజీవ దహనమైంది. ఆమె తండ్రిపై ఉన్న వ్యక్తిగత కక్షలతో అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు నాయకులు కిరాతకానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక కాళ్లు చేతులు కట్టి పడేశారు. నోట్లో గుడ్డ కుక్కి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం బాలిక మృతి చెందింది. ఈ ఘటన విల్లుపురంలో చోటుచేసుకుంది.

తిరువెన్నై నల్లూరు సమీపంలోని సిరుమదురై గ్రామానికి చెందిన జయపాల్‌ రాజీ దంపతులకు కుమారులు జయరాజ్‌ (16), జబరాజ్‌ (10), కుమార్తెలు జయశ్రీ (15), రాజేశ్వరి (12) ఉన్నారు. వీరికి సిరుమదురైలో రెండు కిరాన షాపులు ఉన్నాయి. జయశ్రీ((15) స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం జయపాల్‌ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని స్థానికలు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయలైన జయశ్రీని విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రికి తరలించారు.