షాక్ : పూణెలోని ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

తెల్లారే సరికి శవమై కనిపించిన కుమార్తె

మహారాష్ట్రలో ఘోరం చోటుచేసుకుంది. పూణెలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు  ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని సుఖ్‌సాగర్‌కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన తర్వాత వారు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే ఈరోజు ఉదయం వారు నలుగురు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. తీవ్ర షాక్ కి గురయ్యారు. వారి ఇంటిపక్కను ఉన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనతో సుఖ్‌సాగర్ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్థానికులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.