కరోనా షాక్ : ఆసుపత్రిలోనే ఉరేసుకొని రోగి మృతి…

భర్త అక్రమ సంబంధం..... భార్య ఆత్మహత్య

కరోనా కాలంలో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కరోనా ధాటికి తట్టుకోలేక ఆసుపత్రులలోనే కాలం వెల్లతీసుకుంటున్నారు. తాజాగా హర్యానాలో ఘోరం జరిగింది. ఆస్ప‌త్రిలో ఉరేసుకున్న క‌రోనా రోగి అక్కడికకక్డే మృత్యవాత పడ్డాడు. దేశంలో క‌రోనా వైర‌స్ వీరలెవల్లో విజృంభ‌స్తుంది.  రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా నమోదవుతున్నాయి.  క‌రోనా వైర‌స్ విస్తరిస్తుండటంతో దేశ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌తున్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తులు కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. మరికొందరు ఆసుపత్రులలోనే మృత్యువాత పడుతున్నారు.

అయితే తాజాగా హర్యానాలోని ముల్ల‌న్న పోలీసు స్టేష‌న్ ఏరియాలో ఓ వ్యక్తికి క‌రోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో 55 ఏళ్ల‌కు చెందిన ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆస్ప‌త్రిలో తాను చికిత్స పొందుతున్న వార్డులోనే ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. కాగా ఈ ఘ‌ట‌న‌ ఆసుపత్రిలో తీవ్ర కలకలం రేపింది.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా కరోనా రోగి కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు స‌మాచారం అందించారు. ప‌ది ఫీట్ల భౌతిక దూరం పాటిస్తూ.. అత‌ని అంత్య‌క్రియ‌ల్లో కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. కాగా మృతుడి కుటుంబ స‌భ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,81,091 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… 12,604 మంది మృతి చెందారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 1,20,504 పాజిటివ్ కేసులు న‌మోదు  కాగా.. అక్క‌డ 5,751 మంది ప్రాణాలు విడవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.  ఇక హర్యానాలో అయితే 134 మంది మరణించగా.. ఇప్పటికే.. 9,128 కరోనా కేసులు నమోదయ్యాయి.