సంచలనంగా మారుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు

సంచలనంగా మారుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు సంచలనంగా మారుతుంది.ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ముమ్మురం చేసిన సంగతి అందరికి తెలిసిందే.అందులో భాగంగా మహేష్ ఫ్యాన్స్ తో చిన్న మీట్ లా మహేష్ తో ఫొటోస్ తీసుకోడానికి ఎగబడ్డారు.అలా వచ్చిన అభిమానులు భారీగా రావడంతో అక్కడ పరిస్థితులు కాస్త అదుపు తప్పాయి.

దీనితో గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఈ మీటింగ్ పై పెద్ద ఎత్తున పుకార్లు బయటకు వచ్చి మహేష్ పై దారుణమైన దుష్ప్రచారాలు మొదలయ్యాయి.చిత్ర యూనిట్ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ దగ్గర ఒక్కొక్కరి నుంచి 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేసారని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మరీ దిగజారుడుగా ప్రచారం మొదలు పెట్టారు.ఇది కాస్త ఓవర్ అనే చెప్పాలి.ట్రోల్స్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ మరీ ఇంతలా డబ్బులు కోసం చేసారు అని చెయ్యడం ప్రచారం చెయ్యడం ఎంత వరకు సమంజసమో వాళ్ళే ఆత్మ విమర్శ చేసుకోవాలి.