తహసీల్దార్ ఆఫీస్ ముందే రైతు ఆత్మహత్య..

Couple Commit Suicide After Daughter Elopes With Lover

తెలంగాణలో ఘోరం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుటే రైతు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.  కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి అనే రైతు.. కాల్వశ్రీరాంపూర్ ఎమ్మార్వో కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే విషయం ఏమిటంటే… తనకున్న ఎకరం 20 గుంటల భూమి అధికారులు తన పేరిట ఆన్‌లైన్ చేయ‌డం లేదంటూ కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందే పురుగుల మందు తాగి రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే ఆ రైతు రాజిరెడ్డి సూసైడ్ నోట్ లో ఎమ్మార్వో వేణుగోపాల్, వీఆర్వోలు గురు ముర్తి, స్వామి ముగ్గురు వ్యక్తులే కారణమని కూడా పేర్కొన్నారు. కాగా ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు.. రైతు మృత‌దేహాన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.