ఫ్లిప్ కార్ట్ పైలట్‌ ప్రాజెక్టు

ఫ్లిప్ కార్ట్ పైలట్‌ ప్రాజెక్టు

వినియోగదారుల నుంచి ప్లాస్టిక్‌ సంచులను సేకరించాలని ఆన్‌లైన​ రీటైల్‌దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్ణయించింది. ఒక పైలట్‌ ప్రాజెక్టు ప్లాస్టిక్‌ కవర్లను సేకరించేందుకు అమలు చేస్తూ వ్యవస్థలో ఉన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్లను రీసైకిల్ చేయడం ప్రారంబించింది. అంతే కాకుండా తిరిగి ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలవల్ల వచ్చే ముప్పుని దృష్టిలో పెట్టుకుని  ఫ్లిప్‌కార్ట్‌ పర్యావరణ పరిరక్షణకు  ఈ చర్యకు దిగింది.

వినియోగదారుల నుండి ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించేందుకు చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లోని ఎంపిక కేంద్రాలలో ఫ్లిప్‌కార్ట్ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను స్వచ్ఛందంగా కంపెనీకి చెందిన ఫ్లిప్‌కార్ట్ విష్ మాస్టర్స్‌కు తమ ప్రొడక్ట్స్‌ డెలివరీ సమయంలో అప్పగించమని వినియోగదారులకు చెప్తుంది. విష్ మాస్టర్స్‌కు వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు సరైన శిక్షణని ఇచ్చి సేకరించిన ప్యాకెట్లు రిజిస్టర్డ్ విక్రేతలకు పంపిస్తుంది. పంపించిన ప్యాకెట్లు రీసైకిల్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది.

ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఇప్పటికే 33 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించింది. దాని సప్లయ్‌ చైన్‌లో 100శాతం మార్చి 2021 నాటికి రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం వైపు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది