పెళ్లి భోజనాల గొడవ.. తూగోలో పలువురికి తీవ్ర గాయాలు…

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోళ్లపర్రులో రెండు కుటుంబాలు పెళ్లి భోజనాల విషయంలో గొడవ జరిగింది. ఆ ఘటనలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన  ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే అసలు విషయం ఏమిటంటే..ఈనెల 15వ తేదీన స్థానికంగా ఓ వివాహం జరిగింది. ఆ కుటుంబం పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత యానాల భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎక్కువమంది బంధువులు రాకపోవడంతో గొడవ మొదలైంది. భోజనాలు సక్రమంగా జరగలేదని.. ఎవరూ రాలేదని బంధువులు పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని టార్గెట్ చేశారు. దీంతో మాటా మాటా పెరిగింది. అయితే భోజనాల విషయంలో మొదలైన గొడవ కొట్లాటకు దారి తీసింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో  ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.