వైసీపీ కీలక నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు. మరోవైపు కిడ్నీ సమస్య ఉన్నట్లు సమాచారం.