లాక్ డౌన్ వేళ సెలూన్ లో సెక్స్ రాకెట్.. నలుగురు అరెస్ట్..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంటే. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. దీంతో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని పోలీసులు చెప్తుండే.. ఓ సెలూన్ నిర్వాహకుడు ఏకంగా సెక్స్ దందానే నడిపిస్తున్నాడు. అలా బుక్కయ్యాడు. సెలూన్ ముందు తలుపులు మూసేసి వెనక డోర్ నుంచి విటులను ఆహ్వానించి వ్యభిచారం కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సెలూన్ ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్ చేశారు. దాంతో ఒక విటుడితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటన నగరంలోని స్లిమ్ అండ్ షైన్ సెలూన్‌లో చోటు చేసుకుంది. అయితే వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. గిరిడిహ్ నుంచి నగరానికి వచ్చి కాకే రోడ్ ప్రాంతంలో నివాసముంటున్న సుమన్ పండిట్ సెలూన్ పేరుతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. ఏజెంట్ల సాయంతో విటులను రప్పించి సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌‌‌తో ప్రజలను, అధికారులను నమ్మించేందుకు సెలూన్ ముందు వైపు షట్టర్లు మూసేసి వెనక డోర్ నుంచి విటులను ఆహ్వానించి కోల్‌కతా నుంచి రప్పించిన అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు.

దీంతో పక్కా సమాచారం అందుకున్న లాల్‌పూర్ పోలీసులు సెలూన్‌పై దాడులు చేశారు. నిర్వాహకుడు సుమన్ పండిట్, అతని సహాయకుడు యూపీకి చెందిన కసిఫ్ అలం, విటుడు సరయు ప్రసాద్ తో పాటు కోల్‌కతాకు చెందిన కాల్‌గర్ల్‌ని అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.