గంటా ఇమేజ్ కు చిల్లు పడిందా..?

adhi-role-clarifies-in-pawa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ganta Srinivas Rao Image Damaged

గంటా శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు టీడీపీకి తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటికే భూకుంభకోణాల్లో ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీంతో సీఎం కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారట. ఇది చాలదన్నట్లు టీచర్ల ఆందోళనకూ గంటా నిర్లక్ష్య వైఖరే కారణమని సీఎం మండిపడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే.. చంద్రబాబు వద్ద గంటా పరువు గంగలో కలిసినట్లేనని ఆయన వ్యతిరేకులు సంబరపడుతున్నారు.

గంటాను దెబ్బకొట్టాలని ఎప్పట్నుంచో చూస్తున్న అయ్యన్నకు ఈ అంశాలు బాగా కలిసొస్తున్నాయి. దీనికి తోడు సీఎం స్వయంగా చెప్పిన మాటలు కూడా గంటా పట్టించుకోకపోవడం చంద్రబాబుకు చిరాకు తెప్పిస్తోందట. ప్రతిష్ఠాత్మకంగా ఆన్ లైన్లో టీచర్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. గంటా నిర్లక్ష్యం కారణంగా వాళ్లు రోడ్డెక్కారనేది సీఎం మాట. ఏ పూటకు ఆ పూట మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇవ్వమన్నా గంటా పట్టించుకోలేదట.

గంటా మంత్రిగా కాకుండా మంచి మేనేజర్ గా వ్యవహరిస్తున్నారనే టీడీపీ వర్గాలు ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు.. గంటాపై సీఎంకు విశ్వాసం కోల్పోయేలా చేశాయి. వచ్చే ఎన్నికల్లో గంటాకు చంద్రబాబు చెక్ చెబుతారని, గంటా బ్యాట్ కు కూడా హెచ్చరికలు జారీ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే.. గంటా మళ్లీ కష్టపడక తప్పే పరిస్థితి లేదు.