ఆ ముగ్గురు చెర నుంచి తప్పించుకున్న బాలిక.

దేశానికి ఒక పక్క కరోనా కలవరం పట్టుకుంటే… మరోపక్క మనిషికి కామం అనే కోరికలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దేశమంతా కరోనాతో లాక్‌డౌన్ ప్రకటిస్తే… అంతా నిర్మానుష్యంగా ఎక్కడివారు అక్కడే ఇళ్లకే పరిమితమౌతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో హైస్కూల్ విద్యార్థులు తోటి విద్యార్థినిని చిత్రహింసలకు గురిచేశారు.

ఏడవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. తోటి విద్యార్థినిని అత్యాచారం చేయబోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ బాలుడు అమ్మాయికి ఫోన్ చేసి మట్లాడాలని చెప్పి ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి రమ్మన్నాడు. దాంతో ఆ అమ్మాయి ఆ అబ్బాయి చెప్పిన చోటకే వెళ్లాడు. అప్పడు ఆ ముగ్గురు విద్యార్థులు ఆ బాలికను పట్టుకొని బంధించి బట్టలు విప్పేందుకు సాహసించారు. చిన్నగా ఆ అమ్మాయి ఏదోలా వారి చెర నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాలురు ముగ్గురు మైనర్లు కావడంతో పోలీసులు వారి వివరాలను గోప్యంగా ఉంచారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.