శాపంగా మారిన ఆన్‌లైన్ పరిచయం

శాపంగా మారిన ఆన్‌లైన్ పరిచయం

ఆన్‌లైన్ పరిచయం ఓ అమ్మాయికి శాపంగా మారింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడిని కలవడం కోసం 13 ఏళ్ల ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 21 ఏళ్ల యువకుడు మరో మైనర్ బాలుడితో కలిసి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 13 ఏళ్ల ఓ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు కొద్ది రోజుల కిందట అదే ప్లాట్‌ఫామ్‌లో 21 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ బాలిక తరచూ అతడితో చాట్ చేస్తోంది. అతడితో పాటు ఓ మైనర్ బాలుడితో కూడా చాటింగ్ చేసేది.

ఈ క్రమంలో ఆ బాలికను చూడాలని ఉందంటూ ఆ యువకుడు ఆమెకు మామమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మి బుధవారం (జనవరి 27) ఆమె ఉన్నపలంగా ఇంట్లో నుంచి వచ్చేసింది. జైపూర్‌లో సూరత్ వెళ్లే బస్సు ఎక్కేసింది. బస్సు ఛార్జీలు చెల్లించడానికి ఆమె వద్ద డబ్బులు కూడా లేవు. కానీ, ఆ యువకుడు కండక్టర్ నంబర్ తీసుకొని యూపీఐ ట్రాన్స్‌ఫర్ చేశాడు.

ఆ యువకుడు చెప్పిన ప్రకారం ఆ బాలికను కండక్టర్ సూరత్‌లో ఓ చోట దింపేశాడు.సూరత్ నుంచి ఆ బాలికను నేరుగా ముంబై తీసుకెళ్లాడు ఆ యువకుడు. కుర్లాలోని ఓ ప్రాంతంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడితో పాటు మైనర్ బాలుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు.