ఏపీ రైతులకు శుభవార్త.. 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్

Good news for AP farmers.. Free electricity for 25 years
Good news for AP farmers.. Free electricity for 25 years

ఇంధన రంగానికి సంబంధించి రూ.6600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, పనులను సీఎం జగన్ వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేసారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కడప 750 మెగావాట్లు సామర్థ్యము, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రోజెక్టుల నిర్మాణానికి సీఎం జగన్ వర్తువల్గా ప్రారంభించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో HPCLతో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం జగన్ సమక్షంలో అవగాహనా ఒప్పందం జరిగింది.

25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్

సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనేది ప్రభుత్వ లక్షమన్నారు. ఇవాళ ప్రారంభించిన సబ్ స్టేషన్లతో స్థానికులు కష్టాలు తీరనున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే రైతులకు 9 గంటల విద్యుత్ పగటిపూటే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు శ్రీకారం చుట్టామన్నారు. 14 జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం చేసుకున్నామన్నారు. గోదావరి ముంపు ప్రాంతాలైన వీఆర్ పురం, చింతూరు , ఎటపాకలో సబ్ స్టేషన్లను ఇవాళ ప్రారంభిచామన్నారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. రూ.1700 కోట్లతో పీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిచామన్నారు. ఉచిత విధ్యుత్ ను స్థిరంగా ఇచ్చేందుకు సేఖితో ఒప్పదం చేసుకున్నామన్నారు. మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు.

రాష్ట్రంలో సుమారు రూ 3099 కోట్లతో 28 సబ్ స్టేషన్లను నిర్మించామని సీఎం జగన్ తెలిపారు. కొన్నింటిని ఇవాళ ప్రారంభించామని, మరికొన్నింటిని పనులు మొదలయ్యాయన్నారు . దీంతో పాటు రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవర్ కు శ్రీకారం చుడుతున్నామన్నారు. అవేరా స్కూటర్స్ సంస్థ రూ.6500 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు . తాజాగా ప్రారంభించిన సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు . 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ వాళ్ళ మరో 1700 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. HPCL సంస్థతో రూ. 10 వేల కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతో ప్రత్యక్ష,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు