ఏపీ ప్రజలకు శుభ వార్త

ఏపీ ప్రజలకు శుభ వార్త

ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 178 కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది 4,333 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీకి ఫిబ్రవరి 3వ తేది వరకు ఉపాధి హామీ వేతనాలకు సంబంధించి 178 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఏపీ సీం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమరావతి, మండలి రద్దుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజభన హామీల అమలుతో పాటు పలు అంశాలను మరోసారి సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.