యూజర్లకు గుడ్‌న్యూస్

యూజర్లకు గుడ్‌న్యూస్

కొత్త సంవత్సరం సందర్భంగా యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో. 2021 మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా.. న్యూ ఇయర్ కానుకగా ఓ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచాక.. జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్ యూజర్లకు కొంత ఊరటనివ్వనుంది. జియో ప్రకటించిన కొత్త సంవత్సర ఆఫర్ ఏంటి.. యూజర్లకు అందే అదనపు ప్రయోజనాలు ఏంటంటే..రూ.2,545 వార్షిక ప్లాన్‌పై కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది జియో.

ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే సాధారణంగా 336 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఆఫర్ కింద 29 రోజుల అదనపు వ్యాలిడిటీ ఇస్తోంది జియో. దీంతో మొత్తం మీద 365రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే జియో సినిమా, జిటో టీవీ, జియో క్లౌడ్, జియో సావన్ లాంటి జియా సూట్ యాప్స్ యాక్సెస్ పొందవచ్చు.న్యూఇయర్ ఆఫర్ 2022 జనవరి 2వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది.

అప్పటి వరకు జియో ఈ అదనపు ప్రయోజనాన్ని అందించనుంది. మైజియో యాప్, జియో వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ పరిమితకాల ఆఫర్ ముగిశాక రూ.2,545 ప్లాన్‌పై 336రోజుల వ్యాలిడిటీనే వస్తుంది.మరోవైపు అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టి జియో ఇటీవల సంచలనం సృష్టించింది. రూ.1కే ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఒకరోజు వ్యాలిడిటీతో 10ఎంబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకొచ్చిన తొలి రోజు 100ఎంబీ ఇవ్వనున్నట్టు కనిపించినా.. ఆ తర్వాత 10ఎంబీకి కుదించింది.