సినిమా థియేటర్స్ మూసేయాలని గవర్నమెంట్ ఆదేశం

సినిమా థియేటర్స్ మూసేయాలని గవర్నమెంట్ ఆదేశం

ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది కరోనా వైరస్. చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే థియేటర్స్ మూసేయండని ఆర్డర్స్ వేసింది గవర్నమెంట్.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలి తీసుకున్న కరోనా వైరస్.. భారత భూభాగాన్ని కూడా తాకింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక్క కేరళ లోనే 12 కేసులు నమోదయ్యాయి. దీంతో వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసిన కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.