హరిహర వీరమల్లు మూవీ ఉన్నట్టా, లేనట్టా ? అంటే…

Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలైనటువంటి హరిహర వీరమల్లు సినిమా పై అటు మేకర్స్ లో, ఇటు ఆడియెన్స్ చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ లో ఉంటుందో!.. ఉండదో! అని భావిస్తుండగా తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్ చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నింటిలో హరిహర వీరమల్లు సినిమానే ముందుగా షూటింగ్ ప్రారంభం అయ్యింది . హుటాహుటిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసిన దర్శకుడు క్రిష్.. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేశారు.

కానీ తరువాత నుంచి మాత్రం ఈ సినిమా నత్త నడకన సాగుతుంది. ఈ సినిమా కంటే ఆలస్యంగా మొదలైన ఓజీ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో చేస్తున్న’ బ్రో ‘చిత్రం అయితే ఏకంగా జులై 28న విడుదలవుతోంది. సినీ పరిశ్రమలో మాత్రం ఈ సినిమా ఇకపై ఉండదు అనేంతగా మాట్లాడుకుంటుండగా.. ఇటీవలే నిర్మాత ఏ.ఎం.రత్నం ఎలాంటి పరిస్థితిల్లోనైనా ఈ చిత్రాన్ని పూర్తి చేసి తీరుతామని.. కాకపోతే వచ్చే ఏడాది అయినా తీస్తామని చెప్పారు. తాజాగా హరిహరవీరమల్లు మూవీపై నిధి అగర్వాల్ ,ఫ్యాన్స్ ఉత్సాహపరిచేలా ఓ పోస్ట్ చేసింది.

రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ తన తొలి పోస్ట్ గా ఇండస్ట్రీలో సన్నిహితులైన అందరి ఫోటోలను ఓ వీడియో ద్వారా షేర్ చేశాడు. ఇక ఆ వీడియోలో హరి హరవీరమల్లు మూవీకి సంబంధించి నిధి అగర్వాల్ తో కలిసి ఉన్న ఒక ఫొటో ఉండగా.. ఆ ఫోటోను నిధి షేర్ చేస్తూ.. ఈ సినిమా గురించి మాట్లాడింది. “ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Sir, డైరెక్టర్ క్రిష్ Sir, AM రత్నం Sir తో కలిసి రాబోయే చిత్రం హరిహరవీరమల్లు ఎపిక్ జర్నీలో భాగం అయినందుకు కృతజ్ఞతలు. అలాంటి అద్భుతమైన చిత్ర బృందంతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను . మీరు అందరూ త్వరలోనే ఓ అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు” అంటూ పోస్ట్ చేసింది నిధి అగర్వాల్. ఈమె చేసిన పోస్ట్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో హరి హరవీరమల్లు మూవీపై అంచనాలు పెరిగాయనే చెప్పవచ్చు.