భార్యపై అనుమానంతో 20రోజుల పసికూనను చంపేశాడు.

భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ భర్త ఏకంగా 20రోజుల పసిబిడ్డను నరికి చంపేశాడు. 20 రోజుల క్రితం జన్మనిచ్చిన బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్న నాయక్ ఆమెతో తరుచూ గొడవ పడి వేధిస్తూ వస్తున్నాడు. దీంతో తాజాగా ఓ రాత్రి గొడ్డలితో బిడ్డను చంపేశాడు. అయితే అందుకు కారణ భార్య ప్రవర్తనగా తెలుస్తోంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి నీచానికి దిగజారాడు. 20 రోజుల పసికందును గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. భావ్‌నగర్ జిల్లా గాధా తాలూకాలోని వికారియా గ్రామానికి చెందిన కలు నాయక్‌‌కు మంజుల అనే మహిళతో 12ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఐదుగురు సంతానం.. 20 రోజుల క్రితం మంజుల ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. కాగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నాయక్.. ఆరో బిడ్డ తనకు పుట్టలేదని మంజులతో కొద్దిరోజులుగా గొడవ పడుతున్నాడు. బిడ్డకు తన పోలికలు లేవని.. ఎవరితో సంబంధం పెట్టుకొని కన్నావో చెప్పాలంటూ గొడవ పెట్టుకోవడం వేధించడం స్టార్ట్ చేశాడు.

ఇలా రోజు గొడవపడుతుండటం పరిపాటిగా మారింది. అదే సమయంలో కట్టలు తెంచుకున్న ఆయన ఆగ్రహం నిద్రపోతున్న పసికందును గొడ్డలితో నరికి చంపేశాడు. భార్యపైనా దాడి చేసేందుకు యత్నించగా.. ఆమె తప్పించుకొని కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. పక్కింట్లో ఉండే అర్జున్ నాయక్ అనే వ్యక్తి మంజులను కాపాడేందుకు ప్రయత్నించగా నాయక్ అతడిపైనా గొడ్డలితో వేటు వేశాడు. చివరకు స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.