చివరకు రక్షిత ఆ పని మొదలెట్టిందా !

heroine rakshitha turned dubbing artist

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

ఇడియట్ చిత్రంతో నటు రక్షితను పూరీ జగన్నాథ్ పరిచయం చేశాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున, చిరంజీవి వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడింది ఈ కన్నడ భామ. కానీ, కెరీర్ మంచి రేంజ్‌లో దూసుకుపోతున్నప్పుడే కన్నడ డైరెక్టర్‌ను పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత మళ్లీ సినిమాల ఊసే ఎత్తలేదు. అయితే.. అలనాడు హీరోయిన్లుగా అలరించిన వారంతా కూడా మళ్లీ అమ్మలుగా తెరపై మెరుస్తున్నారు. రక్షిత విషయంలో కూడా ఇదే జరుగుతుందా అని భావించారు సినిమా పండితులు.

అయితే ఈ మధ్య రక్షిత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ సినీ పండితుల అంచనాల ప్రకారం ఈసారి ఏ పాత్రల్లోనూ నటించడంలేదు. ఈ మధ్యే కొన్ని టీవీ షోలతో బిజీగా ఉన్న ఆమె మరోసారి భర్త సినిమా కోసం తన గొంతును సవరించుకున్నారు. భర్త ప్రేమ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ‘విలన్‌’ సినిమాలో అమీ జాక్సన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారామె. ఈ సినిమా హిట్ అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ను డబ్బింగ్ తోనే కొనసాగించాలని రక్షిత అనుకుంటోంది. సో.. మొత్తానికి రక్షిత ఈ విధంగా కొత్త ఉద్యోగం మొదలుపెట్టిందన్న మాట.