తాజ్‌ హోటల్‌కు మరోసారి పాక్ తీవ్రవాదుల హెచ్చరిక

తాజ్‌ హోటల్‌కు మరోసారి పాక్ తీవ్రవాదుల హెచ్చరిక

నగరంలోని ప్రఖ్యాత తాజ్‌ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. సోమవారం అర్థ‌రాత్రి 12.30 గంట‌ల‌కు కాల్ చేసిన ఆగంత‌కుడు బాంబుల‌తో హోట‌ల్‌ను పేల్చివేస్తామ‌ని బెదిరించిన‌ట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. దీంతో వెంట‌నే పోలీసులు అప్రమత్తమయ్యారు. హోట‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌లోని క‌రాచీ నుంచి ఆ ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.

కాగా, 2008 నవంబర్‌ 26న తాజ్‌హోట‌ల్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడిలో 166 మంది మృతిచెందారు. 300 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. పాక్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదులు ఈ దాడికి ప్లాన్‌ చేశారు.మరోవైపు క‌రాచీలోని స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై సోమవారం ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఈ దాడికి పాల్ప‌డిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయి. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఇద్దరు పౌరులు కూడా మృతి చెందారు.