ఉప్పు తక్కువగా తీసుకోవటం మంచిది

ఉప్పు తక్కువగా తీసుకోవటం మంచిది

శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్‌ అని కూడా అంటారు. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెద‌డు సంబంధ ర‌క్త‌నాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. సాధార‌ణంగా ప్ర‌వ‌హించే వేగానికి విరుద్ధంగా ర‌క్తం ప్ర‌వ‌హిస్తుండ‌టం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

హైపర్ టెన్షన్ అతి తీవ్రస్థాయికి పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. హైపర్‌టెన్షన్‌ను సులువుగా అదుపు చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో నిరోధించవచ్చు. వ్రమాదకరస్థాయికి చేరకుండా నిరోధించేందుకు జాగ్రతగా చికిత్స అందించాలి.

రోజు వాకింగ్ చేయడం వల్ల రక్త పీడనం సాధారణ స్థితిలో ఉంటుంది. మీరు వారంలో కేవలం 4 నుండి 5 నిమిషాల పాటు గుండెపైన ప్రభావం చూపే పనులు చేయాలి. వీటి వల్ల రక్తపోటు సాధారణ స్థితిలోకి చేరటం మీరు గమనించవచ్చు. రోజు 15 నిమిషాల పాటు వ్యాయామాలను చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.హైబీపీ సమస్య ఉన్నప్పుడు రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జ‌బ్బులు రావ‌డానికి అవ‌కాశాలు ఏర్ప‌డుతాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు 120/80 గా ఉండాలి. అయితే హైప‌ర్‌టెన్ష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌పడేవారిలో ఈ న‌మోదు 130/90 మి.మీ. అంతకన్నా అధికంగా ఉంటుంది.

మీ కుటుంబంలో ఎవ్వరికీ హైబీపీ లేకపోయినా మీరు ఉప్పు తక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. తీసుకునే ఆహారంలో అవసరమైతే తప్ప, ఒక చిటికెడు ఉప్పును కూడా ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువ రుచికోసం ఉప్పుకు బదులుగా నిమ్మరసం, వెల్లుల్లి, మిరియాలు వంటి ఔషధాలను తీసుకోవాలి.తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, సంతృప్త కొవ్వులు కొలెస్టరాల్‌తో కూడిన ఆహారాన్ని తినడం వల్ల మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే మీ రక్తపోటును 11 mm Hg వరకు తగ్గించవచ్చు. అయితే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంత సులభం కాదు. కానీ ఈ చిట్కాలతో మీరు హెల్తీ డైట్‌ను అనుసరించవచ్చు. మీరు తినేవాటిని వారం పాటు ముందే రాసిపెట్టుకోండి. అప్పుడే మీ ఆహారపు అలవాట్లను ముందే తెలుసుకోవచ్చు. కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చు.

వంట‌ల త‌యారీలో నూనెలు, కొవ్వు ప‌దార్థాల‌ వాడ‌కం త‌గ్గించాలి. మ‌సాలాలు, కారం వాడ‌కాన్ని అదుపులో పెట్టుకోవాలి. నిల్వ ప‌చ్చ‌ళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్‌ ఫుడ్స్‌ పూర్తిగా తగ్గించాలి. వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి. శ‌రీరానికి ఒత్తిడి, ఆందోళన క‌లగ‌కుండా చూసుకోవాలి. పొటాషియం శరీరంలో ప్రతికూల చర్యలను కలగచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది శరీరానికి కావలసిన మినరల్, సోడియానికి వ్యతిరేకంగా ఉంటుంది. కావున మీరు తీసుకునే ఆహారంలో సోడియానికి బదులుగా పోటాషియంను వాడటం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధంగా ఎక్కువ పొటాషియంను కలిగి ఉన్న పండ్లను ఎక్కువగా తినండి.

నిమ్మ,ఆరెంజ్, కివీ, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు.అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి.

పచ్చని ఆకుకూరలలో పోషకాలు అధికం. వాటిలో ఐరన్ ఉంటుంది. ఇవి మీ అధిక రక్తపోటు తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. చర్మం మెరుపు పొందుతుంది.ఆల్కహాల్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. బాగా అలవాటు ఉన్న వారు ఒక్కసారిగా మానలేరు కాబట్టి మితంగా మాత్రమే ఆల్కహాల్ తాగాలి. పురుషులు రోజుకు రెండు పెగ్గులు మాత్రమే వేయడం ద్వారా మీ రక్తపోటును దాదాపు 4 mm Hg వరకు తగ్గించవచ్చు. ఇంకా లెక్కగా చెప్పాలంటే… 12 ఔన్సుల బీర్, ఐదు ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల 80 ప్రూఫ్ మద్యం మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా మద్యం తీసుకుంటే మాత్రం శరీరంలో అధిక రక్తపోటు ప్రభావం మరింత పెరుగుతుంది.

మీరు తాగే ప్రతి సిగరెట్ కాసేపటికే మీ శరీరంలో రక్తపోటును పెంచుతుంది. ధూమపానం మానేయడం వల్ల మీ రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధూమపానం మానేసిన వ్యక్తులు ధూమపానం మానేయని వ్యక్తుల కంటే ఎక్కువ కాలం జీవించగలరు.40 ఏళ్ల వ‌య‌సు పైబడిన‌ వారు యేటా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవ‌డం.. కుటుంబంలో ఎవరైనా అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్నా కనీసం సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని గుర్తుంచుకోవాలి. దీని ద్వారా హైప‌ర్ టెన్ష‌న్ రాకుండా చూసుకోవ‌చ్చు.