సాగర తీరంలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ

సాగర తీరంలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ

రోహిత్‌ శర్మ ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. బెంగళూరు నుండి సాగర తీరానికి  ఇండిగో విమానంలో దిగి నొవోటెల్ హోటల్‌కు వచ్చారు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ ఇప్పుడు కెరీర్‌లో కీలక మలుపులో ఉన్నాడు. విజయనగరం శివారులోని  గురువారం నుంచి   డా.పీవీజీ రాజు క్రీడా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో ఓపెనర్‌గా జట్టును అతడు నడిపించనున్నాడు .కెప్టెన్‌ హోదాలో బోర్డు ఎలెవెన్‌ను నడిపించనున్న హిట్‌మ్యాన్‌ పైనే  అందరి దృష్టి ఉంది. రోహిత్‌  శర్మతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు కూడ బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు.

విజయనగరం వేదికగా రేపటి నుంచి మూడు రోజులు పాటు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగనుంది.

ఇండియా బోర్డ్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఆడబోతున్నాడు. ఈ ఆటలో మయాంక్‌ అగర్వాల్, కరుణ్‌నాయర్, శార్ధూల్‌ ఠాకూర్, ఉమేష్‌ యాదవ్‌ కూడా ఆడబోతున్నారు. అటు దక్షిణాఫ్రికా  జట్టులో  కూడా ప్రధాన ఆటగాళ్లు ఆడబోతున్నారు.